
మినిమమ్ బ్యాలెన్స్ జరిమానాలు.. 3 ఏళ్లలో బ్యాంకులకు ₹19 వేల కోట్లు
సేవింగ్స్ ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ నిల్వ ఉంచకపోవడంతో బ్యాంకులు కస్టమర్ల నుంచి భారీగా జరిమానాలు వసూలు చేస్తున్నాయి. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో ప్రైవేట్ బ్యాంకులు సుమారు ₹11,000 కోట్లకు పైగా మినిమమ్ బ్యాలెన్స్ ఛార్జీలు వసూలు చేసినట్లు కేంద్రం వెల్లడించింది. ఇదే కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా దాదాపు ₹8,000 కోట్ల వరకు వసూలు చేశాయి. దీంతో మొత్తం కలిపి సుమారు ₹19,000 కోట్లకు పైగా బ్యాంకులకు ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది. ఈ వసూళ్లలో HDFC బ్యాంక్ అత్యధికంగా ₹3,800 కోట్లకు పైగా సేకరించింది. తరువాత Axis Bank, ICICI Bank ఉన్నాయి. అయితే SBI వంటి కొన్ని ప్రభుత్వ బ్యాంకులు సేవింగ్స్ ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ జరిమానాలను ఇప్పటికే రద్దు చేశాయి. జన్ ధన్ వంటి బేసిక్ సేవింగ్స్ ఖాతాలకు ఈ నిబంధనలు వర్తించవు.
సంబంధిత వార్తలు

కర్నూలులో దారుణం..హాస్పిటల్ బెడ్పై బాలింతను చంపిన భర్త
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. హాస్పిటల్ బెడ్పై బాలింతగా ఉన్న భార్యను భర్త దారుణంగా కత్తితో పొడిచి చంపాడు. విచక్షణారహితంగా పొడవటంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. కత్తితో పొడిచిన సమయంలో నిందితుడు మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.

BREAKING: ఆగమైన హైద్రాబాద్.. రంగంలోకి హైడ్రా
నగరంలో కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, బాచుపల్లి, సుచిత్ర తదితర ప్రాంతాల్లో వర్షానికి 53 చోట్ల చెట్లు పడిపోయాయి. 4సె.మీ. వర్షం కురవగా 8 చోట్ల రహదారులపై వర్షం నీరు నిలిచిపోయింది. ఈ ఫిర్యాదులను హైడ్రా సిబ్బంది క్లియర్ చేశారు. నగరవ్యాప్తంగా ఈదురుగాలులు వీచాయి. పలు చోట్ల చెట్లు పడిపోయినట్టు హైడ్రా కంట్రోల్ రూమ్ కి ఫిర్యాదులు రాగా రాత్రి 8.30 ప్రాంతం వరకు అన్ని క్లియర్ చేసినట్టు హైడ్రా తెలిపింది.

డబ్బున్న మైనర్లను ట్రాప్ చేస్తున్న ముఠా అరెస్ట్
ఇన్స్టాలో డబ్బున్న బాలికలను ట్రాప్ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కీలక నిందితుడు అర్జున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విదేశాల్లో ఉంటున్న తల్లిదండ్రుల పిల్లలను, హైదరాబాద్లోని అత్యంత సంపన్న కుటుంబాలకు చెందిన మైనర్ బాలికలను లక్ష్యంగా చేసుకుంటోంది ఈ గ్యాంగ్. ఒంటరిగా ఉండే పిల్లల బలహీనతలను ఆసరాగా చేసుకుని...సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో వారితో స్నేహం నటిస్తూ ట్రాప్ చేస్తున్నారు.

OPERATION OCTOPUSE: 32 మంది బ్యాంక్ అధికారులు అరెస్ట్
HYD పోలీసులు చేపట్టిన ‘ఆపరేషన్ ఆక్టోపస్-2.0’ ద్వారా దేశవ్యాప్త సైబర్ మోసాల ముఠా గుట్టురట్టయింది. 9 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించిన పోలీసులు, 32 మంది బ్యాంకు అధికారులు సహా మొత్తం 52 మందిని అరెస్ట్ చేశారు. నేరగాళ్లకు సహకరిస్తూ అక్రమ ఖాతాలు తెరిచి ఇచ్చిన బ్యాంకర్లే టార్గెట్గా ఈ ఆపరేషన్ సాగింది. ట్రేడింగ్, డిజిటల్ అరెస్ట్ పేరుతో దాదాపు రూ.150 కోట్ల మేర వీరు దోచుకున్నారు.